Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో వెయ్యికి చేరువైన కరోనా కేసులు.. కొత్తగా 56

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (20:29 IST)
కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటోంది. లాక్‌డౌన్ కూడా పొడగించింది. లాక్‌డౌన్ ఆంక్షలను కూడా కఠినతరం చేసింది. రెడ్ జోన్ ఏరియాలను సీల్ చేసింది. అయినప్పటికీ.. తెలంగాణాలో కరోనా కేసులు ప్రతి రోజూ పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం కూడా మరో 56 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. 
 
తాజాగా నమోదైన కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 928కు చేరింది. అలాగే, కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 23 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 711 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 8 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు మొత్తం 194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
కాగా, సూర్యాపేట జిల్లాలో ఒక్కరోజే 26 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. జీహెచ్‌ఎంసీలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాలలో 2, ఆదిలాబాద్‌లో 2 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, ఖమ్మం, మేడ్చల్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments