Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయిపై యుద్ధం ప్రకటించాలి: సీఎం కేసీఆర్ పిలుపు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (18:24 IST)
గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలన్నారు. డ్రగ్స్‌ మరియు గంజాయి అక్రమ రవాణా మరియు వాటి నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…. గంజాయి అక్రమ సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని… పరిస్థితి తీవ్రం కాకముందే అరికట్టాలని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని… తెలిసీ తెలియక దీని బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక పరిస్థితి దెబ్బతింటుందని… ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని… డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియామకం చేయాలని ఆదేశించారు. 
 
విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని… దీని కోసం ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గుడుంబా, గ్యాంబ్లింగ్ మళ్లీ వస్తున్నాయని… డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలని వెల్లడించారు సీఎం కేసీఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments