Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలిక హత్యాచారంపై ఆందోళన

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (18:18 IST)
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధి అగనంపూడి వద్ద ఇటీవల జరిగిన మైనర్ బాలిక పాండ్రంకి పావని మృతి కేసుపై న్యాయం జరగాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం, రూరల్ మండలాల రజక వృత్తిదారులు సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగు రాజు, భీమవరం టౌన్ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ నేతృత్వంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రముఖ న్యాయవాది బేతపూడి లోకేష్ ప్రాంతీయ కార్యాలయం నుండి కొవ్వొత్తులు వెలిగించి  పావని అమర్ రహే అంటూ నిరసన ర్యాలిని ప్రకాశం చౌక్ సెంటర్ వరకు నిర్వహించారు.


మృతి చెందిన మైనర్ బాలిక పావని కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగు రాజు, చింతాడ శ్రీనివాస్, కొత్తపల్లి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రజక మహిళలకు రక్షణ కరువైందని బాలిక మృతిపై. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు.


ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేతపూడి లోకేష్, దొమ్మేటి సుబ్బయ్య, నేదునూరి గంగాధరం తిలక్, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, చిటికెల వాసు, లెఫ్ట్ బుజ్జి, గరగపర్తి మల్లేశ్వరరావు,, మావుళ్ళమ్మ రజక సంఘం నాయకులు, మారుతి నగర్ రజక సంఘం నాయకులు, రూరల్ మండలాల రాజకీయ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments