Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడారం జాతరలో ముఖ్యమంత్రి కేసీఆర్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (15:46 IST)
తెలంగాణ గడ్డపై జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకునే మెడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా మేడారంకు చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
ఇదిలావుంటే, మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి గురువారం రాత్రి 9.19 గంటలకు గద్దెపైకి చేరింది. తల్లి రాక వేళ మేడారం శిగమూగింది. కోళ్లు, మేకలు తలలు తెంచుకొని రక్తతర్పణం చేశాయి. 
 
సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరడంతో నిండుపున్నమి, పండు వెన్నెల మధ్య జాతర పరిపూర్ణంగా మారింది. వనదేవతల కొలువుతో గద్దెలు వేయి వెలుగుల కాంతితో తళుకులీనుతున్నాయి. భక్తులపై తల్లులు వర్షిస్తున్న ఆశీస్సులతో గద్దెలు దివ్యక్షేత్రంగా భాసిల్లుతున్నాయి. 
 
మేడారం ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతోంది. వేయికళ్లుకూడా చాలవన్న చందగా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సమ్మక్క రాకతో యావత్‌ మేడారం శిగాలూగింది. మహాజాతర పతాకస్థాయికి చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments