Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడారం జాతరలో ముఖ్యమంత్రి కేసీఆర్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (15:46 IST)
తెలంగాణ గడ్డపై జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద జాతరగా చెప్పుకునే మెడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా మేడారంకు చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
ఇదిలావుంటే, మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి గురువారం రాత్రి 9.19 గంటలకు గద్దెపైకి చేరింది. తల్లి రాక వేళ మేడారం శిగమూగింది. కోళ్లు, మేకలు తలలు తెంచుకొని రక్తతర్పణం చేశాయి. 
 
సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరడంతో నిండుపున్నమి, పండు వెన్నెల మధ్య జాతర పరిపూర్ణంగా మారింది. వనదేవతల కొలువుతో గద్దెలు వేయి వెలుగుల కాంతితో తళుకులీనుతున్నాయి. భక్తులపై తల్లులు వర్షిస్తున్న ఆశీస్సులతో గద్దెలు దివ్యక్షేత్రంగా భాసిల్లుతున్నాయి. 
 
మేడారం ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతోంది. వేయికళ్లుకూడా చాలవన్న చందగా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సమ్మక్క రాకతో యావత్‌ మేడారం శిగాలూగింది. మహాజాతర పతాకస్థాయికి చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments