Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోడీనే చెప్పారు.. ఉండవల్లి

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (15:24 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఎలుగెత్తి చాటారని గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తొలగించేటపుడు, ఆ తర్వాత 2022 బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఏపీ విభజన రోజు బ్లాక్ డే‌ అంటూ పేర్కొన్నారని అరుణ్ కుమార్ గుర్తుచేశారు. అందువల్ల ఏపీ విభజన తీరుపై ఇపుడు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విభజనపై ఏం మాట్లాడారో దీనిపై సుప్రీంకోర్టులో కేసు కూడా వేసినట్టు ఆయన వెల్లడించారు. దీని గురించి కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించినట్టు తెలిపారు. దీనిపై చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ఏం చేయలేదని విమర్శించారు. విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, ఏబీ విభజన, పోలవరం అంశాలపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అరుణ్ కుమార్ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments