Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్: 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలిస్తే చాలు

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్: 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలిస్తే చాలు
, శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (10:56 IST)
తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా సిలబస్ ఇంకా పూర్తి కాకపోవడంతో 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాబోయే ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022లో విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. 
 
ఆబ్జెక్టివ్ పార్ట్‌లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా ఛాయిస్‌ ప్రశ్న పత్రాల థియరీ విభాగాలలో మార్పులు చేశారు. మొత్తంమీద, ఈ సంవత్సరం ఎస్‌ఎస్‌సీ పరీక్షలలో ప్రశ్నలలో 50 శాతం ఛాయిస్ ఉంటుంది. మోడల్ ప్రశ్న పత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఒక అధికారి తెలిపారు. 
 
ముందుగా ప్రకటించినట్లుగా ఎస్‌ఎస్‌సీ పరీక్షలు 2022 అన్ని సబ్జెక్టులలో మొత్తం సిలబస్‌లో 70 శాతం మాత్రమే నిర్వహించబడతాయి. సాధారణ 11 పేపర్‌లకు బదులుగా ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి.
 
ఇప్పటి వరకు 4.81 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14తో ముగియగా, విద్యార్థులు పరీక్ష రుసుమును రూ. 50 మరియు రూ. 200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 24 వరకు మరియు మార్చి 4 వరకు చెల్లించవచ్చు. 
 
రుసుము కూడా రూ. 500 ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు ఆమోదించబడుతుంది. గత సంవత్సరం దాదాపు 5.16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. 
 
అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించబడలేదు. విద్యార్థులు వారి ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కొత్తగా 25 వేల పాజిటివ్ కేసులు - 492 మంది మృతి