Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైకు వెళ్ళనున్న సీఎం కేసీఆర్ - ఆదివారం ఉద్ధవ్‌తో లంచ్ మీటింగ్

ముంబైకు వెళ్ళనున్న సీఎం కేసీఆర్ - ఆదివారం ఉద్ధవ్‌తో లంచ్ మీటింగ్
, గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:27 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 20వ తేదీన ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై సాగిస్తున్న పోరాటంలో భాగంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమై లంచ్ మీటింగ్ జరుపుతారు.
 
ప్రధాని మోడీ, ఎన్డీయే సర్కారుపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన జాతీయ స్థాయి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులతో ఆయన ఫోనులో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవెగౌడతోను ఫోనులో మాట్లాడారు. ఇపుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావాలని నిర్ణయించారు. 
 
అయితే, ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ముంబైకు వెళ్ళనున్నారు. గత బుధవారం సీఎం కేసీఆర్‌కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి.. బీజేపీపై సాగిస్తున్న పోరులో తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. "కేసీఆర్ జీ... మీ పోరాటం స్ఫూర్తిదాయకం. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఇదే సరైన సమయం" అని ఈ సందర్భంగా ఠాక్రే వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ నివాసంలో కేంద్ర మంత్రి గడ్కరీకి ఆతిథ్యం