Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సు చార్జీలపై ఆందోళన - బండి సంజయ్ హౌస్ అరెస్టు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (13:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ప్రయాణ చార్జీలను భారీగా పెంచేసింది. ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు తీవ్రంగా గగ్గోలు పెడుతూ ఆందోళనకు దిగాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా, జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన జరిగే ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. 
 
బంజారా హిల్స్‌లోని ఆయన ఇంటి చుట్టూత పోలీసు బలగాలను మొహరించారు. దీంతో ఆయన బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్య ప్రజానీకంపై మరింత భారం మోపారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వమా? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తెరాస మూడేళ్ల పాలనలో ఇప్పటివరకు ఐదుసార్లు బస్సు చార్జీలను పెంచిందని గుర్తుచేశారు. 
 
పేదలను బస్సులో కూడా ప్రయాణించకుండా చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్సు చార్జీలు 60 శాతం మేరకు పెంచారని ఆయన ఆరోపించారు. తెలంగాణ పోలీసులకు రేపిస్టులను అరెస్టు చేయడం చేతకాదు గానీ, బీజేపీ నేతల గృహాలను మాత్రం ముట్టడించడం బాగా తెలుసని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments