Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైహోమ్ సయుక్ ప్రాజెక్టును ప్రారంభించిన పుష్ప

Allu Arjun
, గురువారం, 9 జూన్ 2022 (14:29 IST)
హైదరాబాదులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రాబోతుంది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద మైహోమ్ సంస్థ చేపట్టిన "మైహోమ్ సయుక్" రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్‌ను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. 
 
గురువారం జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ మైహోం సంస్థల చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు, ఎండి జూపల్లి శ్యామ్ రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మైహోమ్ సంస్థ ఏర్పాటై 35 సంవత్సరాలు పూర్తిచేసుకున్నసందర్భంగా సంస్థ యాజమాన్యంకు, సంస్థలో పనిచేసే ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. 
 
మైహోమ్ సంస్థ నుంచి వస్తున్న మరోనూతన ప్రాజెక్ట్ మైహోమ్ సయుక్ ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్టుల కంటే కూడా గొప్పగా ఉంటుందని అల్లు అర్జున్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీనియర్ నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారా?