Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

gang rape
, గురువారం, 9 జూన్ 2022 (12:50 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురయ్యారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు సికింద్రాబాద్‌లో మైనర్‌ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రేమ పేరుతో మోసం చేసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నవాజ్‌ (21), ఇంతియాజ్‌ (21)ను అంబర్‌పేట్‌ వాసులుగా గుర్తించారు. అక్క, చెల్లెల్ని ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకొని నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ వివేకా హత్య కేసు : కీలక సాక్షి మృతి