Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌ నడపడంలో పోటీపడుతున్న అన్నా చెల్లి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (12:52 IST)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్. షర్మిళలు ఇపుడు ట్రాక్టర్లు నడపడంలో పోటీ పడుతున్నారు. ఇటీవల వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్రాక్టర్ నడిపారు. ఇపుడు ఆయన చెల్లి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిళ కూడా ట్రాక్టర్ నడిపారు. ప్రస్తుతం ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న విషయం తెల్సిందే.
 
ప్రస్తుతం ఆమె సాగిస్తున్న పాదయాత్ర ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గన్నవరం గ్రామంలో ఆమె తండ్రి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గ్రామ ప్రజల కోరిక మేరకు తలపాగా చుట్టి ట్రాక్టర్ నడిపారు. గన్నవరం నుంచి ఖానాపూర్ గ్రామం వరకు ఆమె ట్రాక్టర్ నడిపి అభిమానులను, రైతులను ఆనందపరిచారు. ఇపుడు షర్మిల ట్రాక్టర్ నడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments