Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌ నడపడంలో పోటీపడుతున్న అన్నా చెల్లి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (12:52 IST)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్. షర్మిళలు ఇపుడు ట్రాక్టర్లు నడపడంలో పోటీ పడుతున్నారు. ఇటీవల వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్రాక్టర్ నడిపారు. ఇపుడు ఆయన చెల్లి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిళ కూడా ట్రాక్టర్ నడిపారు. ప్రస్తుతం ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న విషయం తెల్సిందే.
 
ప్రస్తుతం ఆమె సాగిస్తున్న పాదయాత్ర ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గన్నవరం గ్రామంలో ఆమె తండ్రి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గ్రామ ప్రజల కోరిక మేరకు తలపాగా చుట్టి ట్రాక్టర్ నడిపారు. గన్నవరం నుంచి ఖానాపూర్ గ్రామం వరకు ఆమె ట్రాక్టర్ నడిపి అభిమానులను, రైతులను ఆనందపరిచారు. ఇపుడు షర్మిల ట్రాక్టర్ నడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments