శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్ : నాకే డబ్బులు ఇవ్వాలంటున్న రాధికా రెడ్డి

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:11 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన శిల్పాచౌదరి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో కిట్టీ పార్టీల కోసం దివానోస్ పేరుతో ఓ క్లబ్‌ను ఏర్పాటు చేసినట్టు తేలింది. ఇందులో సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సభ్యులుగా చేరారు. ఈ క్లబ్‌లో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నట్టు సమాచారం. ఈ కిట్టీ పార్టీలకు వచ్చిన వారికి అధిక వడ్డీ ఎరవేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తేలింది. 
 
అంతేకాకుండా, శిల్పా చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు తమ కష్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో రాధికా రెడ్డి అనే మహిళతో పాటు మరో మహిళ పేరును ఆమెను వెల్లడించారు. దీంతో రాధికా రెడ్డి హైదరాబాద్ నగర పోలీసులకు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా చౌదరే తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. 
 
తాజాగా జరిపిన విచాణలో షామీర్ పేటకు చెందిన చంద్ర మల్లా రెడ్డి, ప్రతాప్ రెడ్డి పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అసలు శిల్పా చౌదరి ఎంత మందిని ఈ విధంగా మోసం చేసిందన్న విషయంపై ఆరా తీసేందుకు పోలీసులు మరోమారు కష్టలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సోమవారం ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, శిల్పాచౌదరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తొలుత కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ వచ్చిన ఆమె.. ఆ పార్టీలకు వచ్చే అనేక మంది సినీ సెలబ్రీటలకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకున్నారు. 
 
కానీ, వారికి వడ్డీ చెల్లించలేదు కదా అసలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దివ్యారెడ్డి అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో హీరో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments