Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్ : నాకే డబ్బులు ఇవ్వాలంటున్న రాధికా రెడ్డి

Advertiesment
Hyderabad
, సోమవారం, 6 డిశెంబరు 2021 (10:17 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన శిల్పాచౌదరి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శిల్పా చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు తమ కష్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో రాధికా రెడ్డి అనే మహిళతో పాటు మరో మహిళ పేరును ఆమెను వెల్లడించారు. దీంతో రాధికా రెడ్డి హైదరాబాద్ నగర పోలీసులకు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా చౌదరే తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. 
 
అసలు శిల్పా చౌదరి ఎంత మందిని ఈ విధంగా మోసం చేసిందన్న విషయంపై ఆరా తీసేందుకు పోలీసులు మరోమారు కష్టలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సోమవారం ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశా ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, శిల్పాచౌదరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తొలుత కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ వచ్చిన ఆమె.. ఆ పార్టీలకు వచ్చే అనేక మంది సినీ సెలబ్రీటలకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకున్నారు. 
 
కానీ, వారికి వడ్డీ చెల్లించలేదు కదా అసలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దివ్యారెడ్డి అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో హీరో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌గ‌న్ కు స‌పోర్ట్ లేదు... అమరావతి రైతులవైపే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!