Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోడీ - రూ.9600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్)తో పాటు ఎరువుల తయారీ కర్మాగారం, మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే రూ.9600 కోట్ల విలువ చేసే వివిధ రకాలైన జాతీయ ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 
 
గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్ ఆస్పత్రిని నెలకొల్పారు. ఇది ఒక్క యూపీలోని పూర్వాంచల్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న బీహార్‌ రాష్ట్రం, నేపాల్ దేశ పౌరులకు కూడా సేవలు అందించనుంది. 2016 జూలై 22వ తేదీన ఈ ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, రూ.1000 కోట్లకు పైగా నిధులతో నిర్మించారు. అలాగే గోరఖ్‌పూర్‌లో నిర్మించిన ఎరువుల తయారీ కర్మాగారాన్ని సైతం ప్రారంభించనున్నారు. 
 
ఈ రెండింటిని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు. అయితే, కొత్తగా తెరవనున్న ఎరువుల కర్మాగారం గత 30 యేళ్లుగా మూతపడివుంది. దీన్ని రూ.8600 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. ఈ ప్లాంట్‌లో ఏటా 12.7 ఎల్ఎంటీ దేశీయ వేపపూతతో కూడిన యూరియాను ఉత్పత్తి చేస్తారు. అలాగే, గోరఖ్‌పూర్‌లో ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం కొత్త భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments