Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తకి విషం పెట్టిన భార్య....

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:19 IST)
వివాహేతర సంబంధం ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ప్రియుడితో శృంగారానికి కట్టుకున్న భర్త అడ్డుగా వున్నాడని, అతడికి అన్నంలో విషం కలిపి పెట్టింది ఓ భార్య. అది తిన్న అతడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం కోబల్ తండాకి చెందిన 30 ఏళ్ల మోహన్, పావనిలు దంపతులు. ఐతే గత కొన్ని నెలలుగా ఆమె అదే తండాకి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తుంది. ఇది కాస్తా భర్తకు తెలిసిపోయింది. 
 
దాంతో ఈ విషయాన్ని పెద్దమనుషుల ముందు పెట్టాడు. పంచాయతీ చేసిన పెద్ద మనుషులు ఇరువుర్ని మందలించి ఇకనైనా బుద్ధిగా వుండాలని సూచించారు. కానీ పావని మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు. తన భర్త కంటే ప్రియుడే కావాలనుకున్న ఆమె పథకం ప్రకారం తన భర్తకు విషం కలిపిన ఆహారాన్ని ఇవ్వడంతో అది తిన్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగువారు అతడి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments