Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్​లో నామినేషన్ల స్వీకరణ

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:25 IST)
పురపాలక ఎన్నికల్లో అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఖర్చులకు పాత బ్యాంకు ఖాతాలని సూచించింది. దీంతో పాటు కరీంనగర్​ నగరపాలక సంస్థకు 24న ఎన్నికలు, 27న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు వెల్లడించింది.

కరీంనగర్​ నగరపాలక సంస్థకు ఈనెల 24న ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఓట్ల లెక్కింపు ఈ నెల 27న చేపడుతారు. వార్డుల పునర్విభజన సక్రమంగా జరగలేదనే నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులతో ఈనెల 7న కరీంనగర్​ నోటిఫికేషన్​ వెలువడలేదు.

కాగా ఎన్నికలకు హైకోర్టు గురువారం పచ్చ జెండా ఊపింది. దీంతో ఎస్​ఈసీ నోటిఫికేషన్​ ఇచ్చింది. దీనికి అనుగుణంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల అధికారి నోటిఫికేషన్ ఇచ్చి ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
 
నిజామాబాద్​లో నామినేషన్​ వేసిన హిజ్రా
తామేమీ తక్కువ కాదంటూ ఓ హిజ్రా కార్పొరేషన్​ ఎన్నికల్లో నామినేషన్​ వేసింది. నిజామాబాద్​ కార్పొరేషన్​ 16 డివిజన్​కు జరీనా అనే హిజ్రా నామ పత్రాలు దాఖలు చేసింది. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్​గా పోటీ చేసేందుకు ఓ హిజ్రా ముందుకు వచ్చింది.

16 డివిజన్ అభ్యర్థిగా జరీనా అనే హిజ్రా నామినేషన్​ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని జరీనా తెలిపారు. ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకులు కూడా ప్రజలకు చేసిందేమీ లేదని ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments