Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:23 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులు.. ఉరి నుంచి తప్పించుకోవడానికి తమకున్న చివరి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దోషుల్లో ఒకరైన వినయ్​కుమార్​ శర్మ.. ఇప్పటికే సుప్రీం కోర్టులో క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేయగా.. తాజాగా మరో నిందితుడు ముకేశ్​ కుమార్​ కూడా మరణ శిక్షను సవాల్​ చేస్తూ అదే వ్యాజ్యం దాఖలు చేశాడు.

నిర్భయ సామూహిక హత్యాచారం కేసు దోషి ముకేశ్​ కుమార్‌.. సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరి శిక్షపై స్టే విధించాలని వ్యాజ్యం నమోదు చేశాడు. న్యాయపరంగా చివరి అవకాశాన్ని వినియోగించుకున్నాడు ముకేశ్​ కుమార్‌.

దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరు ముకేశ్​ కుమార్​. న్యాయస్థానం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీర్పు ఇచ్చిందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. సామాజిక-ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల ఆనారోగ్యం, జైల్లో సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశాడు.

నిర్భయ కేసులో మరో నిందితుడైన వినయ్‌కుమార్‌శర్మ మరణ శిక్షను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments