Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:23 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులు.. ఉరి నుంచి తప్పించుకోవడానికి తమకున్న చివరి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దోషుల్లో ఒకరైన వినయ్​కుమార్​ శర్మ.. ఇప్పటికే సుప్రీం కోర్టులో క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేయగా.. తాజాగా మరో నిందితుడు ముకేశ్​ కుమార్​ కూడా మరణ శిక్షను సవాల్​ చేస్తూ అదే వ్యాజ్యం దాఖలు చేశాడు.

నిర్భయ సామూహిక హత్యాచారం కేసు దోషి ముకేశ్​ కుమార్‌.. సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరి శిక్షపై స్టే విధించాలని వ్యాజ్యం నమోదు చేశాడు. న్యాయపరంగా చివరి అవకాశాన్ని వినియోగించుకున్నాడు ముకేశ్​ కుమార్‌.

దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరు ముకేశ్​ కుమార్​. న్యాయస్థానం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీర్పు ఇచ్చిందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. సామాజిక-ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల ఆనారోగ్యం, జైల్లో సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశాడు.

నిర్భయ కేసులో మరో నిందితుడైన వినయ్‌కుమార్‌శర్మ మరణ శిక్షను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments