Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక చాలు.. కాశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయండి.. సుప్రీం ఆదేశం

Advertiesment
ఇక చాలు.. కాశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయండి.. సుప్రీం ఆదేశం
, శుక్రవారం, 10 జనవరి 2020 (16:24 IST)
జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ ఆంక్షలపై శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుతో 158 రోజుల తర్వాత కాశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్‌నెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
 
ఇంటర్నెట్ సేవలపై జమ్మూలో ఎలా ఆంక్షలు విధిస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వెంటనే కాశ్మీర్లో ఇంటర్‌నెట్‌ వినియోగంపై కొనసాగుతున్న ఆంక్షలు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. అంతేగాకుండా కేంద్రానికి సుప్రీం షాకిచ్చింది. ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పట్నించి కశ్మీర్‌లో కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 
 
ఎమర్జెన్సీ ఉందంటూ ప్రజల హక్కులకు భంగం కలిగిస్తే ఎలా అని జస్టిస్ ఎన్వీ రమణ, సుభాష్ రెడ్డి, గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అంతేగాకుండా ఆర్టికల్ 19లో ఇంటర్నెట్ ఒక భాగం అని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. వారం రోజులలో ఆంక్షలపై సమీక్ష నిర్వహించాలని కేంద్ర హోంశాఖను జడ్జీల బృందం ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుళ్ళూరులో మహిళా రైతులపై ఖాకీ జులం.. జాతీయ మహిళా కమిషన్ కన్నెర్ర