రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (14:39 IST)
తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీజేపీ అనుబంధ విద్యాసంస్థ అయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం తెలంగాణాలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఏపీవీపీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇంటర్ విద్యా విధానంలో కార్పొరేట్ కాలేజీలను ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆరోపించారు. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల ముందు ఏబీవీపీ ఆందోళన చేపడుతుందని తెలిపారు. 
 
ఇందులోభాగంగా, సోమవారం నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నాలు చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై ఇంటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ వైఖరిని ఖండిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments