Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రసవం.. భార్య మృతి.. ఆ బాధను తట్టుకోలేక భర్త రైలు కింద పడి ఆత్మహత్య

ప్రసవం.. భార్య మృతి.. ఆ బాధను తట్టుకోలేక భర్త రైలు కింద పడి ఆత్మహత్య
, శనివారం, 20 ఆగస్టు 2022 (17:18 IST)
పసిబిడ్డకు ఊపిరి పోసి పురిట్లోనే భార్య మరణించింది. ఆ బాధను తట్టుకోలేక భర్త కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా మక్తల్‌కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్.. తన ఇంటి పక్కనే ఉండే భీమేశ్వరిని ప్రేమించాడు. 
 
వీరిద్దరి ప్రేమను యువతి తల్లీదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం విహహం చేసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చారు. భార్యాభర్తలిద్దరూ ఎంతో అప్యాయంగా ఉంటున్నారు. నవీన్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం భార్య భీమేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేర్చాడు. 
 
ప్రసవం అనంతరం భీమేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లితో పాటు శిశువును మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి బాగోకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి ఆసుపత్రిలో ప్రాణం విడిచింది. 
 
ఓ పక్క చిన్నారి ప్రాణపాయ స్థితిలో ఉండటం, మరోవైపు ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృత్యుఒడికి చేరడంతో మనస్తాపానికి గురైన నవీన్ కుమార్ తాను చనిపోవాలని నిర్ణయించుకుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
మృతుడి జేబులో సెల్ ఫోన్ ఆదారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వైపు భార్య చనిపోయిందన్న బాధలో తాను చనిపోవడంతో.. రెండు రోజుల క్రితం జన్మించిన చిన్నారి అనాథగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.350 కోట్లకు డోలా మాత్రల విక్రయం - రూ.1000 కోట్లు తాయిలాలా?