Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక భరించేది లేదు.. భర్తపై కసి తీర్చుకున్న భార్య.. మర్మాంగంపై వేడినీళ్లు

crime scene
, బుధవారం, 17 ఆగస్టు 2022 (22:09 IST)
భర్త పెట్టే చిత్రహింసలు అనుభవించలేక.. భర్తకు తగిన శిక్ష ఇచ్చింది. వేడి నీటిని భర్త మర్మాంగంపై పోసి కసితీరా కోపాన్ని తీర్చుకుంది. ఆపై పోలీసుల ముందు లొంగిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాణిపేట జిల్లా కావేరిపాక్కంకు చెందిన తంగరాజ్ అనే వ్యక్తికి ప్రియ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత కొన్ని రోజులు బాగానే ఉన్న తంగరాజ్ ఆ తరువాత మృగంలా మారిపోయాడు. నిత్యం భార్యను అనుమానిస్తూ కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు.
 
ఇందుకు వేరొక యువతితో భర్త సంబంధం పెట్టుకోవడమే కారణమని తెలిసింది. అంతే భర్తకు తగిన శిక్ష వేయాలని భావించిన ఆమె మంగళవారం ఇంట్లో నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై మరుగుతున్న నీటిని కుమ్మరించింది.
 
ఆ బాధను తట్టుకోలేక తంగరాజ్ అరుస్తుండడంతో తిరిగి ఆమెనే భర్తను ఆసుపత్రిలో చేర్పించి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్య శ్రీ పథకంలోకి మరో 754 చికిత్సలు