Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధం...

amit shah
, ఆదివారం, 21 ఆగస్టు 2022 (12:52 IST)
తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. మునుగోడు బహిరంగ సభతో తెలంగాణలో అధికార పీఠానికి మార్గం సుగమం చేసుకోవాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఇక మునుగోడు సభలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. 
 
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బీజేపీ సభకు రానున్న అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగసభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. కాగా.. అమిత్ షా మునుగోడు షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. 
 
మధ్యాహ్నం 2 గంటలకు స్పెషల్ ఫైయిట్‌లో ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట్‌ నుంచి నేరుగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం బేగంపేట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు వెళ్లనున్నారు అమిత్ షా. 
 
సభ అనంతరం మునుగోడు నుంచి రోడ్డు మార్గన హైదరాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకుంటారు. తిరిగి రాత్రి 10 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు : 33మంది మృతి