Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహం జరిగి 48 గంటలు గడవకముందే విషాదం.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (15:33 IST)
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ముక్తాపురం గ్రామంలో పెళ్లి ఇంట విషాదం జరిగింది. నవ వరుడుతో పాటు తల్లిదండ్రులు విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృత్యువాత పడ్డారు. ఆ ఇంట వివాహం జరిగి 48 గంటలు కూడా గడవకముందే ఈ దారుణం జరగడంతో కన్నీటి పర్యంత అవుతున్నారు కుటుంబ సభ్యులు. 
 
వర్షం పడుతున్న కారణంగా బయట ఆరేసిన బట్టలు తీయడానికి వెళ్లిన ఈ నలుగురూ ఒకరి తరువాత ఒకరు షాక్‌కు గురై చనిపోయినట్టు తెలుస్తోంది. పెళ్లి పందిరి అలంకరణకు ఫోకస్ లైట్లను అమర్చారు. దానికి సపోర్టుగా ఉండేలా ఒక వైరును బిగించి ఇనుప రాడ్డుకు చుట్టారు. 
 
అదే రాడ్డుకు బట్టలు ఆరేయడానికి మరొక వైరును కూడా బిగించడంతో విద్యుత్ షార్ట్ సర్కూట్ అయింది. వర్షం పడటంతో బట్టలు తీసేందుకు వెళ్లిన వారు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. చనిపోయిన వారిలో పెళ్లి కొడుకు చిందం ప్రవీణ్, పెళ్లి కొడుకు తండ్రి చిందం సాయిలు, పెళ్ళి కొడుకు తల్లి చిందం గంగమ్మ.. పెళ్లి కొడుకు మేనత్త శామల గంగమ్మ నలుగురు చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments