Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ ఫోన్ కోసం ఛాంపియన్ చెల్లిని తోసేశాడు... చనిపోయింది... గుంటూరులో...

స్మార్ట్ ఫోన్ కోసం ఛాంపియన్ చెల్లిని తోసేశాడు... చనిపోయింది... గుంటూరులో...
, గురువారం, 6 జూన్ 2019 (17:35 IST)
సెల్ ఫోన్లతో ఉపయోగాలు ఎన్ని వున్నాయో నష్టాలు కూడా అన్నే వున్నాయి. ఈ సెల్ ఫోన్ల మాయలో పడి చాలామంది టీనేజ్ పిల్లలు తాము ఏం చేస్తున్నామో పట్టించుకోవడంలేదు. మరికొందరైతే సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇవికాకుండా సెల్ ఫోన్ల కోసం పిల్లల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరులో జరిగిన ఘటనలో ఓ బాలిక ప్రాణాలు పోయాయి.
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని చినకొండాయపాలేనికి చెందిన 13 ఏళ్ల గోరంట్ల విజయలక్ష్మి ఏడో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో తల్లి, అన్నయ్యలతో కలిసి అమ్మమ్మగారి ఊరు ఉప్పలపాడుకు వచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య మంగళవారం నాడు స్మార్ట్ ఫోన్ వ్యవహారంలో తోపులాట జరిగింది. తనకు ఫోన్ చూపించాలంటూ విజయలక్ష్మి అన్నయ్యను అడిగింది. 
 
అందుకు అతడు ససేమిరా అనడమే కాకుండా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న చెల్లెల్ని బలంగా తోసేశాడు. అంతే... ఆమె తల నేలకి బలంగా తగిలింది. దీంతో ఆమె పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విజయలక్ష్మి క్రీడల్లో ఛాంపియన్‌గా పలు బహుమతులు అందుకుంది. కేవలం స్మార్ట్ ఫోన్ కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఇంటిల్లపాది శోకంలో మునిగిపోయారు.‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత్తుమందు కలిపేశారు.. వంటగదిలో కెళ్తే.. కౌగిలించుకున్నారు.. అరెస్ట్