Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో తెలుగు యువకుడు మృత్యువాత... నదిలో బోటు షికారుకెళ్లి...

అమెరికాలో తెలుగు యువకుడు మృత్యువాత... నదిలో బోటు షికారుకెళ్లి...
, మంగళవారం, 4 జూన్ 2019 (19:50 IST)
ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు అమెరికాలోని ఓ నదిలో మునిగి గల్లంతయ్యాడు. విశాఖకు  చెందిన ఎ.వెంకటరావు కుమారుడు అవినాష్‌. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి మంచి  ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
 
వారాంతపు సెలవులో రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ నదిలో బోటు షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు అవినాష్. నది లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్‌ నదిలో మునిగిపోయాడని స్థానిక అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు అవినాష్ స్నేహితులు. దీంతో విశాఖ ప్లాంట్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుల్లిఉల్లిలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మజ్జిగలో ఉల్లిముక్కల్ని కలిపి తాగితే?