Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాసా రోవర్ చాలెంజ్ పోటీలకు తెలంగాణ స్టూడెంట్స్ ఎంపిక

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. 'హ్యూమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ చాలెంజ్‌' ఫైనల్స

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (11:07 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. 'హ్యూమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ చాలెంజ్‌' ఫైనల్స్‌లో ఐదుగురు విద్యార్థులు పోటీపడనున్నారు. అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై ప్రతి ఐదేళ్లకోసారి నాసా ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తోంది. 
 
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన పాల్‌ వినీత్, ప్రకాశ్‌ రాయినేని, శ్రవణ్‌రావు, దిలీప్‌రెడ్డి, స్నేహ ఈ టీమ్‌లో ఉన్నారు. వీరిని ప్రొఫెసర్ మనోజ్‌ చౌదరి గైడ్ చేస్తున్నారు. చంద్రుడిపై సురక్షితంగా మానవులు తిరిగేందుకు రోవర్‌ డిజైన్‌ను తయారు చేసి, నివేదిక అందించడంలో అనేక దశలు దాటుకుని వీరు ఈ స్థాయికి చేరుకున్నారని ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం గురువారం తెలిపింది. 
 
‘వేరే గ్రహంపై తిరుగాడేందుకు అనువైన వాహనాన్ని తయారు చేయాలని ప్రతిష్టాత్మక నాసా చాలెంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల నుంచి పోటీ పడగా, దేశం మొత్తం మీద 4 బృందాలు ఎంపికయ్యాయి’ అని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12 నుంచి 14 వరకు అమెరికాలో హూస్టన్‌ విల్లేలోని అలబామా యూనివర్సిటీలో జరిగే నాసా పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన వారితో పాటు తమ విద్యార్థులు చంద్రుడిపై తిరిగేందుకు అనువైన రోవర్‌ను డిజైన్‌ చేసి తయారు చేస్తారని పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments