Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వైన్‌ ఫ్లూ వైరస్‌కు వరంగల్ ఏసీపీ మృతి

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వర్ధన్నపేట పోలీస్‌ డివిజన్‌ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న దుర్గయ్య యాదవ్‌ (51) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. వారం రోజుల కిందట వర్ధన్నపేట క్వార్టర్స్‌లో ఉన్న

Advertiesment
Warangal
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (08:51 IST)
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వర్ధన్నపేట పోలీస్‌ డివిజన్‌ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న దుర్గయ్య యాదవ్‌ (51) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. వారం రోజుల కిందట వర్ధన్నపేట క్వార్టర్స్‌లో ఉన్న సమయంలో తీవ్ర జ్వరం రావడంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని చికిత్స చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ మృతితో ఈ యేడాది ఇప్పటివరకు స్వైన్ ఫ్లూకు మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. 
 
మరోవైపు... రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ యేడాది ఇప్పటి వరకూ 1750 మందికి ఈ మహమ్మారి సోకినట్లుగా నిర్ధారించగా వీరిలో 44 మంది మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా రోగులపై స్వైన్‌ఫ్లూ పడగ విప్పుతోంది. మృతుల్లో 91 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే కావడం గమనార్హం. 
 
ఈ వైరస్ ఎక్కువగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, మధుమేహులు, గర్భిణులు, ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, సీఓపీడీ, క్యాన్సర్‌, ఆస్తమా రోగుల్లో, కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీరం దాటిన ఇర్మా... ధ్వంసమైన జైలు.. పారిపోయిన ఖైదీలు..