Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలంలో 5 కిలోల బంగారం, 2 కిలోల వెండితో లంకె బిందె, అన్నీ అమ్మవారి నగలే...

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:10 IST)
పొలంలో భూమిని చదును చేస్తుండగా బంగారు బిందె బయటపడింది. అందులో 5 కిలోల బంగారం, 2 కిలోల వెండి వున్నది. ఈ బిందెను చూసిన భూ యజమాని అధికారులకు సమాచారం ఇచ్చారు.
 
వివరాలు చూస్తే.. జనగామ జిల్లా పెంబర్తిలో గురువారం నాడు ఓ లంకెబిందె వెలుగుచూసింది. హైదరాబాదు నగరానికి చెందిన నర్సింహ అనే వ్యక్తి పెంబర్తి పరిధిలో వున్న 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో వెంచర్ వేసేందుకు భూమిని జెసిబితో చదును చేయిస్తున్నాడు. ఆ సమయంలో జెసిబికి లంకెబిందె తగిలింది.
 
 ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయగా వారు వచ్చి బిందెను తెరిచి చూడగా అందులో 5 కిలోల బంగారం, 2 కిలోల వెండి వున్నట్లు కనుగొన్నారు. కాగా తనకు గత కొన్నిరోజులుగా అమ్మవారు కలలోకి వస్తోందనీ, తన భూమిలో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తానని యజమాని చెప్పాడు. కాగా లంకెబిందె బయటపడటంతో పురావస్తు శాఖ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments