Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఫైట్‌: రీ-పోలింగ్.. బ్యాలెట్‌ పత్రాలు తారుమారు కావడంతో..?

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:06 IST)
ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఫైట్‌ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్‌ ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో రీ-పోలింగ్‌ జరగనుంది. 
 
అంటిపేట ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నిర్మల పేరుకు బదులు వేరే పేరును బ్యాలెట్‌పేపర్‌పై ముద్రించడంతో.. నిన్న పోలింగ్‌ నిలిపివేశారు. నెల్లూరు జిల్లా AS.పేట మండలం పొనుగుపాడులో బ్యాలెట్‌ బాక్సును ఓ పార్టీ ఏజెంట్‌ నీటితొట్టెలో వేయడంతో.. అక్కడ కూడా నిన్న పోలింగ్‌ నిలిచిపోయింది.
 
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాలు తారుమారయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో రీ పోలింగ్‌ జరగనుంది. గుంటూరు జిల్లా ఉయ్యందనలో రిగ్గింగ్‌పై కలెక్టర్‌ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
 
ఇక పరిషత్‌ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్‌ జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ దాదాపు 80 శాతం మేర జరిగే పోలింగ్‌.. ఈసారి కేవలం 60.91శాతంగానే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాల్లో కలిపి 81శాతం పోలింగ్‌ రికార్డయింది. అప్పటి కంటే ఇప్పుడు ఏకంగా 20 శాతం మంది తక్కువగా ఓట్లేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments