Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెల్లురు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం ఆ అరటి పండ్ల వ్యాపారిని చూసి అదిరిపోతోంది, ఎందుకో?

నెల్లురు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం ఆ అరటి పండ్ల వ్యాపారిని చూసి అదిరిపోతోంది, ఎందుకో?
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:38 IST)
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాళెంలో ఎస్కే జిలానీ పేరు మారుమోగిపోతోంది. ఇంతకీ అతడు చేసేది తోపుడు బండిపైన గత 40 ఏళ్లుగా అరటిపండ్ల వ్యాపారం. ఐతే ఇందులో వింతేముంది అనుకుంటున్నారు కదా... కానీ ఆ చిరు వ్యాపారి ఏకంగా రూ. 1.20 కోట్లు పెట్టి 108 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసాడు. అది కూడా నెల్లూరు జిల్లా ముంబై జాతీయ రహదారికి ఆనుకుని వున్న బస్టాండ్ సెంటర్ వద్ద వున్న షాపింగ్ కాంప్లెక్సులో. అక్కడే ఎందుకు కొనాల్సి వచ్చింది?
 
జిలానీ గత 40 ఏళ్లుగా ఇదే సెంటర్లో తోపుడు బండిపైన అరటిపండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఐతే ఎన్నాళ్లగానో వున్న పాత కాంప్లెక్సున పడగొట్టి కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని నిర్వాహకులు నిర్ణయించారు. దీనితో అక్కడే పాత కాంప్లెక్స్ వద్ద పండ్ల వ్యాపారాలను చేసుకునేవారిని మెల్లగా ఖాళీ చేయిస్తున్నారు.
 
ఇక తను కూడా ఇలాగే తన తోపుడు బండితో సహా ఆ ప్రదేశాన్ని వదిలిపోవాల్సి వస్తుందన్న భయంతో జిలానీ ధైర్యం చేశాడు. కొత్త కాంప్లెక్సులో కొంత స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే వేలంపాటలో ఆ కాంప్లెక్సులో 108 చదరపు అడుగుల స్థలాన్ని కోటీ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇపుడు నెల్లూరు జిల్లా బుచ్చిలో ఇదే చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? ఐతే త్వరపడండి..