Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వదినను కట్టేసి ఐదుగురు స్నేహితులతో పొలాల్లో అత్యాచారం

Advertiesment
వదినను కట్టేసి ఐదుగురు స్నేహితులతో పొలాల్లో అత్యాచారం
, మంగళవారం, 23 మార్చి 2021 (20:21 IST)
పిల్లలు  పుట్టలేదన్న కారణంతో వేరే పెళ్ళి చేసుకుంది ఒక వివాహిత. తన అన్నను వదిలేసి వేరే పెళ్ళి చేసుకుందన్న కోపంతో వదినపైనే నీచానికి దిగాడు ఆమె మరిది. ఆమెపై పగ తీర్చుకునేందుకు అతి దారుణంగా పొలాల్లోకి లాక్కెళ్లి అక్కడ ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఐదుగురు స్నేహితులను వెంటపెట్టుకుని వెళ్ళి అత్యాచారం చేసాడు.
 
రాజస్థాన్ లోని బరాన్ జిల్లాకు చెందిన మహిళకు సంవత్సరం క్రితమే వివాహమైంది. అయితే పిల్లలు పుట్టకపోవడంతో భర్తపై అనుమానంతో మూడు నెలల క్రితమే తెగతెంపులు చేసుకుని ఇంటికి వచ్చేసింది. పుట్టింటి వారి సలహాతో నెల క్రితమే మరో వివాహం చేసుకుంది.
 
తన పుట్టింటికి దగ్గరలోనే మెట్టినిల్లు కూడా ఉంది. అయితే మొదటి భర్త తమ్ముడు ఆమె రెండో పెళ్ళి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన అన్నను మోసం చేసిందన్న కోపంతో రగిలిపోయాడు. తన స్నేహితులు ఐదుగురిని వెంట పెట్టుకుని పొలాల్లోకి వెళ్ళాడు. తన భర్తతో పాటు అతని చెల్లెలితో కలిసి పనిచేస్తున్న వదినపై లైంగిక దాడికి దిగాడు.
 
అడ్డొచ్చిన ఇద్దరిని త్రాళ్ళతో కట్టేశాడు. వారిద్దరు చూస్తుండగానే ఐదుగురు కలిసి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటకు వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల కట్టలు ఒకవైపు, ఇసుక మరోవైపు: తిరుపతిలో బిజెపి వినూత్న నిరసన