Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని తండ్రిపై కోపం.. ఉరేసుకుని బాలుడి బలవన్మరణం

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (12:56 IST)
స్మార్ట్ ఫోన్లు ప్రాణాలను మింగేస్తున్నాయి. మొబైల్ ఫోన్‌ వాడాల్సినంత అవసరం లేకపోయినప్పటికి చిన్నారులు గేమ్స్‌కు అలవాటు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందేనని టీనేజర్లు పట్టుబడుతున్నారు. ఫోన్ కొనివ్వకపోతే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 
 
తాజాగా అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. స్మార్ట్ ఫోన్ కోసం కన్నబిడ్డ దూరమవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణం 9వ వార్డులో బానోతూ శివలోకేష్ అలియాస్ సోనూ అనే పదిహేనేళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోని కొక్కానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
చనిపోయిన బాలుడు శివ లోకేష్ స్థానిక మాంటిసోరి స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడు శివలోకేష్‌ తండ్రిని సెల్‌ఫోన్‌ కొనివ్వమని గత కొద్దిరోజులుగా కోరుతున్నాడు. కొనివ్వలేదనే మనస్తాపంతోనే ఈ విధంగా ప్రాణాలు తీసుకున్నట్లుగా స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments