Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో లక్షన్నరకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (12:46 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21880 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60 మంది చనిపోయారు. 
 
దేశంలో 4,95,359 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 21,880 మందికి కరోనా వైరస్ సోకినట్టు తెలిపింది. అలాగే, కరోనా నుంచి 21,219 మంది విముక్తులయ్యారు. వీరితో కలుపుకుని కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,71,653కు చేరింది. మరోవైపు, తాగా మృతి చెందిన 60 మందితో కలుపుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,25,930కి చేరింది. 
 
ఇటీవలికాలంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కంటే ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,49,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగాను, రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments