Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (09:34 IST)
తెలంగాణలో చలి వణికిస్తోంది. ఫెంగల్ తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ రెండో వారంలోపు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కొమరం భీమ్ జిల్లాలోని సిర్పూర్‌లో బుధవారం ఉదయం 7.9 సెల్సీయస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
 
ఇది ఈ సంవత్సరం తెలంగాణలో అత్యంత శీతల ప్రదేశంగా నిలిచింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ చలి తీవ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో చలిగాలుల కారణంగా చల్లని వాతావరణం నెలకొంది. 
 
తీవ్ర అల్పపీడనం తమిళనాడును సమీపిస్తున్నందున రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ డాక్టర్ కె. నాగరత్న తెలిపారు. "హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి. వాతావరణం తేమగా ఉంటుంది కానీ వేడిగా ఉండదు" అని చెప్పారు. 
 
నవంబర్ 30 నుండి తెలంగాణ అంతటా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 2 మిమీ నుండి 4 మిమీ వరకు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఉష్ణోగ్రతలు చల్లగా మారుతాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments