Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (09:21 IST)
భువనేశ్వర్‌లో నాలుగేళ్ల బాలికను తల్లిదండ్రులు రూ.40 వేలకు అమ్మేసిన ఘటన సంచలనం సృష్టించింది. బీహార్‌కు చెందిన రోజువారీ కూలీలైన దంపతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాలికను అమ్మేశారని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. బడగడ ప్రాంతానికి చెందిన ఇద్దరు మధ్యవర్తుల సహకారంతో చిన్నారిని పిపిలిలోని మరో దంపతులకు విక్రయించారు. పక్కా సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన బడగడ పోలీసులు బాలికను రక్షించి కేసు దర్యాప్తు చేపట్టారు. 
 
దంపతులు పనిచేస్తున్న ఓ అపార్ట్‌మెంట్ యజమాని తమను అప్రమత్తం చేశారని బడగడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తృప్తి రంజన్ నాయక్ వెల్లడించారు. దీనిని అనుసరించి.. మధ్యవర్తులను పోలీసులు గుర్తించారు. పేదరికం కారణంగా కూలీలు అయిన దంపతులు తమ బిడ్డను అమ్మారని విచారణలో పోలీసులకు తెలియవచ్చింది. 
 
గతవారం, బోలంగీర్ జిల్లాలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నవజాత శిశువును ఆమె తల్లిదండ్రులు విక్రయించారని ఆరోపిస్తూ రక్షించారు. ఇలాంటి ఘటనలు భువనేశ్వర్‌లో అధికంగా నమోదు అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments