Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (15:55 IST)
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో 108 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.
 
సోమవారం నాడు పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచీ రసాయన పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ భారీ పేలుడు కారణంగా రియాక్టర్ పరిధిలోని భవనం కూలిపోగా మరో భవనం బీటలు బారింది. ఈ ప్రమాదంలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ మృతి చెందారు.
 
పేలుడు జరిగిన సమయంలో ఆయన కారులో వచ్చారు. ఆయన అలా వచ్చి కారు లోపల నుంచి దిగే సమయానికి పేలుడు జరగడంతో ఆయన మృత్యువాత పడ్డారు. ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదం జరగడానికి కారణాలేమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments