Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

Advertiesment
pawan kalyan

ఠాగూర్

, శనివారం, 28 జూన్ 2025 (17:23 IST)
హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎహైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు శనివారం దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కార్లతో పాటు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, మీడియా సిబ్బందిపై భౌతిక దాడులకు జరిగాయి. వీటిని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
స్ పార్టీకి చెందిన కార్యకర్తలు శనివారం దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కార్లతో పాటు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, మీడియా సిబ్బందిపై భౌతిక దాడులకు జరిగాయి. వీటిని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేయడానికి నిర్ధిష్టమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఆ మార్గాలను అనుసరించకుండా నేరుగా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.  
 
మహా న్యూస్ చానెల్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా గొంతును నొక్కే ఇలాంటి ప్రయత్నాలను సహించరాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి