Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

Advertiesment
konda murali

ఠాగూర్

, శనివారం, 28 జూన్ 2025 (16:13 IST)
ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన శనివారం గాంధీ భవన్‌‍లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. 
 
వీటిపై ఆయన శనివారం వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇ్చచారు. కాంగ్రెస్ నేతలంటే తనకు అమితమైన గౌరవం ఉంది. కొందరు నేతలపై తాను చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవచ్చు. తాను బలవంతుడినో.. బలహీనుడినో అందరికీ తెలుసన్నారు. 
 
కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరినట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే తపన మా అందరిలో ఉందన్నారు. 
 
మరవైపు, తెలంగాణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ, మేము నోటీసు ఇస్తే కొండా మురళి వచ్చారు. ఆయన మాకు వివరణ ఇచ్చారు. రాతపూర్వకంగా కూడా వివరణ ఇచ్చారు అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు