Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

Advertiesment
car on railway track

ఠాగూర్

, శనివారం, 28 జూన్ 2025 (12:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని శంకర్‌పల్లిలో రైలు పట్టాలపై కారు నడిపిన యువతిని పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై ఆ యువతి దాడి చేసింది. దీంతో ఆమె శంకర్‌పల్లి రైల్వే పోలీస్ స్టేషన్‌లో కేసు కేసు నమోదుచేశారు. ఆమెకు చికిత్స తర్వాత పోలీసులు విచారణ జరుపనున్నారు. 
 
కాగా, రీల్స్ మోజులో ఆ యువతి రైలు పట్టాలపై కారు నడిపింది. నిందితురాలిని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్కీగా పని చేస్తున్నట్టు సమాచారం. పేరు రవికా సోని. లక్నోకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమెను ఇటీవల కంపెనీ యాజమాన్యం విధుల నుంచి తొలగించారు. యువతి మతిస్థితిమితం కోల్పోయిందా లేదా మత్తుపదార్థాలు ఏమైనా తీసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?