Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లలను గొంతుకోశాడు.. తర్వాత ఉరేసుకున్నాడు.. ఎందుకని?

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (11:55 IST)
తెలంగాణలోని రంగారెడ్డిలో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవి (35) అనే వ్యక్తి 6 నుంచి 13 ఏళ్ల వయసున్న తన ముగ్గురు కుమారులను హత్య చేసి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పిల్లలను గొంతుకోసి హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అధిక రాబడులు ఇస్తానని ఆ వ్యక్తి కొందరిని మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లో చేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. వాగ్దానం చేసిన మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించకపోవడంతో గ్రామస్తులు డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. 
 
ఈ విషయమై రవి తన భార్యతో గొడవ పడ్డాడని, ఆమె తమ ఆరేళ్ల కుమారుడిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కానీ చనిపోయేటప్పుడు తన ముగ్గురు కుమారులను గొంతు కోసం చంపి, ఆపై ఉరివేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments