Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 17 చోట్ల ఎన్.ఐ.ఏ సోదాలు...

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (11:52 IST)
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ మంగళవారం దేశ వ్యాప్తంగా 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఓ లష్కరే ఉగ్రవాది బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులోని ఖైదీలకు ఉగ్రవాద భావజాలం బోధిస్తున్నట్టు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా వీటిని చేపట్టినట్లు తెలుస్తోంది. అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలున్న తమిళనాడు, కర్ణాటక సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి.
 
జులై 2023 బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ ఓ ఇంట్లో సమావేశమైన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. వీరందరూ లష్కరే తోయిబా ఉగ్రవాది నజీర్‌ భావజాలంతో ప్రభావితమైనవారిగా గుర్తించారు. అప్పట్లో నిందితుల నుంచి మందుగుండు, ఆయుధాలు, గ్రనేడ్లు, వాకీటాకీలు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. నజీర్‌ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నాడు. గతేడాది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. 
 
ఈ నెల మొదట్లో బెంగళూరు రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన చోటుచేసుకొన్న విషయం తెలిసిందే. ఆ కేసును కూడా నిన్న జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఆ మర్నాడే 2023 నాటి ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించిన తనిఖీలు చోటు చేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం