Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలహీనంగా ఉన్నాడని కొడుకుని ఆస్పత్రిలో చేరిస్తే తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది..

వరుణ్
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (12:43 IST)
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఓ విషాదకర ఘటన జరిగింది. తమ కుమారుడు బలహీనంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కొడుకుని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఉన్నట్టుండి మూర్ఛ రావడంతో ఆ కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ కూకట్ పల్లి సుమిత్రానగర్ ఎల్లంబండ‌కు చెందిన ఇ.రమేష్, మహాలక్ష్మికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొలికాన్పులో కుమార్తె జన్మించింది. ఈ బాలిక కొద్ది రోజులకు అనారోగ్యంతో చనిపోయింది. రెండో సంతానంగా కుమారుడు పుట్టగా, సిద్ధు అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండటంతో తల్లిదండ్రులు అతన్ని నెల రోజుల క్రితం రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన సిద్ధుకు ఒక్కసారిగా మూర్ఛ వచ్చింది. దీంతో ఆ బాలుడిని హుటాహుటిన ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాల్సిందిగా ఆసుపత్రిలోని సిబ్బంది సూచించడంతో తల్లి మహాలక్ష్మి సిద్ధును ఎత్తుకుని పరుగులు తీసింది. ఆమె కాళ్లకు చీర అడ్డుపడి ఆసుపత్రిలోని మెట్ల వద్ద కిందపడిపోయింది. ఒళ్లోనే ఉన్న సిద్ధు కూడా కిందపడటంతో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. దీంతో వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. చిన్నారి సిద్ధు పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. స్ట్రెచర్‌పై తరలించే ఏర్పాట్లు చేసివుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆరోపిస్తున్నారు. అయితే, మందులు కొనేందుకు వెళ్తున్న సందర్భంలో తల్లీకొడుకులిద్దరూ కిందపడ్డారని పోలీసులు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments