Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో కార్మికుల పొట్టకొట్టింది.. ఆటో డ్రైవర్లు

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (12:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొత్త మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నిక హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం తమ పొట్టికొట్టిందంటూ తెలంగాణాలోని అనేక ఆటోల సంఘాల ఆందోళన చేస్తున్నారు. మూడు రంగాల జెండా మూడు చక్రాల ఆటో డ్రైవర్ల పొట్టి కొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన పథకం ఆటో కార్మికులకు నష్టం చేసిందన్నారు. వివిధ జిల్లాల్లో ఆందోళన చేసిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, జగిత్యాల తదితర జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమకు ఉపాధి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 
 
అధ్యక్షుడు సాయిరామ్ మాట్లాడుతూ... తాము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆటోలను నడిపిస్తున్నామని, ఇప్పుడు ఈ పథకం వల్ల పూట గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవైపు ఆటో ఈఎంఐలు, మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు. మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో జీవితాల్లో చీకటిని నింపిందన్నారు. లక్షలాది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. 
 
కార్మికుల ఆటో కార్మికుల జీవితం కోసం ఈ పథకంపై కాంగ్రెస్ పునరాలోచన చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల భృతిని అందించాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments