Webdunia - Bharat's app for daily news and videos

Install App

భిక్షమెత్తుకుంటున్న ఆటో డ్రైవర్లు.. ఎక్కడ? (వీడియో)

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (08:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు భిక్షమెత్తుకుంటున్నారు. తెలంగాణాలో కొత్తగా ఏర్పాటైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని అమల్లోకి తెచ్చింది. ఈ హామీకి మహిళల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. 
 
అదేసమయంలో ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పథకం వల్ల తమ జీవనోపాధిపోయిందని అల్లాడుతున్నారు. ఆటోల్లో ప్రయాణించేది అత్యధికంగా మహిళలేనని, అలాంటి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటోలు ఎవరు ఎక్కుతారని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా, అనేక ప్రాంతాల్లో ఆందోళనలకు కూడా దిగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా పలువురు ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వద్దే భిక్షం అడుక్కుంటూ తమ నిరసన తెలియజేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బిక్షం అడుక్కుంటూ నిరసన తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments