Webdunia - Bharat's app for daily news and videos

Install App

భిక్షమెత్తుకుంటున్న ఆటో డ్రైవర్లు.. ఎక్కడ? (వీడియో)

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (08:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు భిక్షమెత్తుకుంటున్నారు. తెలంగాణాలో కొత్తగా ఏర్పాటైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని అమల్లోకి తెచ్చింది. ఈ హామీకి మహిళల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. 
 
అదేసమయంలో ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పథకం వల్ల తమ జీవనోపాధిపోయిందని అల్లాడుతున్నారు. ఆటోల్లో ప్రయాణించేది అత్యధికంగా మహిళలేనని, అలాంటి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటోలు ఎవరు ఎక్కుతారని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా, అనేక ప్రాంతాల్లో ఆందోళనలకు కూడా దిగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా పలువురు ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వద్దే భిక్షం అడుక్కుంటూ తమ నిరసన తెలియజేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బిక్షం అడుక్కుంటూ నిరసన తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments