Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో కార్మికుల పొట్టకొట్టింది.. ఆటో డ్రైవర్లు

Advertiesment
womens
, ఆదివారం, 17 డిశెంబరు 2023 (12:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొత్త మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నిక హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం తమ పొట్టికొట్టిందంటూ తెలంగాణాలోని అనేక ఆటోల సంఘాల ఆందోళన చేస్తున్నారు. మూడు రంగాల జెండా మూడు చక్రాల ఆటో డ్రైవర్ల పొట్టి కొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన పథకం ఆటో కార్మికులకు నష్టం చేసిందన్నారు. వివిధ జిల్లాల్లో ఆందోళన చేసిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, జగిత్యాల తదితర జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమకు ఉపాధి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 
 
అధ్యక్షుడు సాయిరామ్ మాట్లాడుతూ... తాము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆటోలను నడిపిస్తున్నామని, ఇప్పుడు ఈ పథకం వల్ల పూట గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవైపు ఆటో ఈఎంఐలు, మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు. మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో జీవితాల్లో చీకటిని నింపిందన్నారు. లక్షలాది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. 
 
కార్మికుల ఆటో కార్మికుల జీవితం కోసం ఈ పథకంపై కాంగ్రెస్ పునరాలోచన చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల భృతిని అందించాలని డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్రోలో చీర చిక్కుకుని మహిళ మృతి.. ఎలా?