నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

ఐవీఆర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:29 IST)
కుప్పలుతెప్పలుగా కోళ్లు గిరాగిరా తిరిగి చనిపోతున్నాయి. కోళ్లఫార్ముల్లో కోళ్లు ఊడ్చుకుపోతున్నాయి. కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. చనిపోయిన కోళ్లు వల్ల భారీగా నష్టం వాటిల్లుతుంటే బతికి వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసే దిక్కు లేక అవస్తలు పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామశివారు ప్రాంతంలో వున్నటువంటి కోళ్లఫాంలో మొత్తం 13 వేల కోళ్లకు గాను 7000 బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి.
 
ఇంత భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వాటన్నిటినీ పెద్దగొయ్యి తీసి అందులో వేసేశాడు రైతు. కాగా వున్న కోళ్లను కొనే దిక్కు లేదంటూ వాపోతున్నాడు. కోళ్ల మృతితో తనకు 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందనీ, ప్రస్తుతం తన వద్ద వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదని రైతు వాపోతున్నాడు. మరోవైపు బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోడి మాంసం అమ్ముతున్నవారు ఎవరైనా వుంటే తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. చికెన్ షాపులపై తనిఖీలు చేస్తామన పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments