Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

ఐవీఆర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:29 IST)
కుప్పలుతెప్పలుగా కోళ్లు గిరాగిరా తిరిగి చనిపోతున్నాయి. కోళ్లఫార్ముల్లో కోళ్లు ఊడ్చుకుపోతున్నాయి. కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. చనిపోయిన కోళ్లు వల్ల భారీగా నష్టం వాటిల్లుతుంటే బతికి వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసే దిక్కు లేక అవస్తలు పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామశివారు ప్రాంతంలో వున్నటువంటి కోళ్లఫాంలో మొత్తం 13 వేల కోళ్లకు గాను 7000 బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి.
 
ఇంత భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వాటన్నిటినీ పెద్దగొయ్యి తీసి అందులో వేసేశాడు రైతు. కాగా వున్న కోళ్లను కొనే దిక్కు లేదంటూ వాపోతున్నాడు. కోళ్ల మృతితో తనకు 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందనీ, ప్రస్తుతం తన వద్ద వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదని రైతు వాపోతున్నాడు. మరోవైపు బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోడి మాంసం అమ్ముతున్నవారు ఎవరైనా వుంటే తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. చికెన్ షాపులపై తనిఖీలు చేస్తామన పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments