Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

ఐవీఆర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:29 IST)
కుప్పలుతెప్పలుగా కోళ్లు గిరాగిరా తిరిగి చనిపోతున్నాయి. కోళ్లఫార్ముల్లో కోళ్లు ఊడ్చుకుపోతున్నాయి. కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. చనిపోయిన కోళ్లు వల్ల భారీగా నష్టం వాటిల్లుతుంటే బతికి వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసే దిక్కు లేక అవస్తలు పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామశివారు ప్రాంతంలో వున్నటువంటి కోళ్లఫాంలో మొత్తం 13 వేల కోళ్లకు గాను 7000 బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి.
 
ఇంత భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వాటన్నిటినీ పెద్దగొయ్యి తీసి అందులో వేసేశాడు రైతు. కాగా వున్న కోళ్లను కొనే దిక్కు లేదంటూ వాపోతున్నాడు. కోళ్ల మృతితో తనకు 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందనీ, ప్రస్తుతం తన వద్ద వున్న కోళ్లను కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదని రైతు వాపోతున్నాడు. మరోవైపు బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోడి మాంసం అమ్ముతున్నవారు ఎవరైనా వుంటే తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. చికెన్ షాపులపై తనిఖీలు చేస్తామన పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments