హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (HMIL) యొక్క సీఎస్ఆర్ విభాగం అయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (HMIF), దాని హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద రూ. 3.38 కోట్ల విలువైన స్కాలర్షిప్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 2024లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల నుండి వచ్చిన అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా సమీక్షించింది. ఇప్పుడు వెనుకబడిన సామాజిక-ఆర్థిక నేపథ్యాలకు చెందిన 783 మంది ప్రతిభావంతులైన, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రదానం చేసింది.
ఈ యువ విద్యార్థులలో కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్షలు, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) కోసం సిద్ధమవుతున్న 440 మంది అభ్యర్థులు ఉన్నారు, వీరితో పాటు వివిధ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి ) క్యాంపస్ల నుండి 100 వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 343 మంది విద్యార్థులు సమాజం, పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే వినూత్న ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు.
ఈ స్కాలర్షిప్లను భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల గౌరవనీయ మంత్రి, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, HMIF ట్రస్టీ శ్రీ గోపాలకృష్ణన్ చఠపురం శివరామకృష్ణన్, HMIL కార్పొరేట్ వ్యవహారాలు- ఫంక్షన్ హెడ్ శ్రీ జియోంగిక్ లీ, HMIL కార్పొరేట్ కమ్యూనికేషన్ & సోషల్ వర్టికల్ హెడ్ శ్రీ పునీత్ ఆనంద్ సమక్షంలో ప్రదానం చేశారు.
హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యత గురించి భారత ప్రభుత్వ గౌరవనీయ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మాట్లాడుతూ, “హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ చేపట్టిన ప్రశంసనీయమైన కార్యక్రమం, ఇది మన దేశ పురోగతి పట్ల దాని లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా, ఈ కార్యక్రమం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా, జీవితాలను సుసంపన్నం చేయడం, ఆశయాలను పెంపొందించడం, యువ చేంజ్ మేకర్స్ను శక్తివంతం చేయడం వైపు నడిపిస్తుంది. విద్య, సాంకేతిక పురోగతులు భారతదేశ వృద్ధికి కీలకం, ఇలాంటి కార్యక్రమాలు నైపుణ్యం కలిగిన స్వావలంబన కలిగిన దేశాన్ని నిర్మించడంలో సహాయపడతాయి" అని అన్నారు.