Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు విలువ తెలుసుకో : ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వాలు

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (16:27 IST)
ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపోలేదు. 
 
గత 2008లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషీకి 62,215 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్‌కి 62,216 ఓట్లు వచ్చాయి. అయితే, కొందరు టెండర్ ఓటు వేశారని కోర్టు దాకా వెళ్లడంతో తిరిగి లెక్కించగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయడంతో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్‌ను గెలుపు వరించింది.
 
అదేవిధంగా 2004లో కర్నాటకలోని సంతేమరహళ్ళి స్థానంలో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. ధృవ్‌నారాయణ్‌కు 40,752 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో కృష్ణమూర్తి ఓటమిపాలయ్యారు. అందుకే ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనదేనని రాజ్యంగ నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments