Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చతుర్థి స్పెషల్- పాలతాలికలు ఎలా చేయాలంటే?

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (18:20 IST)
వినాయక చతుర్థి రోజున ఉండ్రాళ్ళు, పాలతాలికలు, పండ్లు వంటివి గణేశునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటి నైవేద్యాల్లో ఒకటైన పాలతాలికలను ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
‌పాలు -  ఒకటిన్నర లీటరు. 
నీళ్లు - ఒక లీటరు. 
పంచదార - పావు కేజీ
‌బెల్లం - పావుకేజి. 
యాలకుల పొడి - ఒక టీ స్పూను. 
నెయ్యి - కొద్దిగా. 
‌సగ్గు బియ్యం - ‌వందగ్రాములు. 
బియ్యపిండి - వందగ్రాములు. 
మైదాపిండి - రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం: 
ముందుగా పాలను నీటిని మరిగించాలి. అందులో సగ్గుబియ్యాని కూడా ఉడికించుకోవాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదారతో పిండిలా కలుపుకోవాలి. పిండిని తాలికల్లా చేసుకుని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ఈ జంతికలు అతుక్కోకుండా కలుపుతూ వుండాలి. తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, యాలకుల పొడిని వేసి కలపాలి. అంతే పాల తాలికలు సిద్ధమైనట్లే. ఈ వంటకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments