సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం.. స్టిక్‌తో దాడి చేస్తూ కనిపించిన రెజ్లర్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (11:00 IST)
ఛత్రసాల్‌ స్టేడియంలో సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత సుశీల్‌ ఈ వీడియో తీయించాడు. దానిని రెజ్లింగ్‌ వర్గాలకు పంపించాలనుకున్నాడు. 
 
కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణా రెండు రోజుల తర్వాత చనిపోవడంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల గాలింపు చర్యలు చేపట్టి.. సుశీల్‌ను అరెస్ట్ చేశారు. అతనిని పట్టుకుంటే లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. సుశీల్‌కు ముందస్తు బెయిల్‌‌ను తిరస్కరించారు. 
 
ప్రస్తుతం కోర్టు రిమాండ్‌లో వున్న సుశీల్ దర్యాప్తునకు సహకరించట్లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో యువ రెజ్లర్‌ సాగర్‌ రాణాపై సుశీల్‌ కుమార్‌ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ పుటేజీ హిందీ, ఇంగ్లిష్‌ మీడియాలో ప్రసారం అవుతోంది. 
 
ఛత్రసాల్‌ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రాణాపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందులో సుశీల్‌ బేస్‌బాల్‌ స్టిక్‌/కర్రను చేతిలో పట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్‌ బయటకు రావడంతో అతడికి మరింత నష్టం కలగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

Rishabh Shetty: కాంతారాచాప్టర్1 దివ్య గాథ బాక్సాఫీస్‌ను కైవసం చేసుకుంది

'కాంతార-1 బాక్సాఫీస్ వద్ద ఊచకోత - 2 వారాల్లో రూ.717 కోట్లు వసూలు

తర్వాతి కథనం
Show comments