సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం.. స్టిక్‌తో దాడి చేస్తూ కనిపించిన రెజ్లర్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (11:00 IST)
ఛత్రసాల్‌ స్టేడియంలో సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత సుశీల్‌ ఈ వీడియో తీయించాడు. దానిని రెజ్లింగ్‌ వర్గాలకు పంపించాలనుకున్నాడు. 
 
కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణా రెండు రోజుల తర్వాత చనిపోవడంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల గాలింపు చర్యలు చేపట్టి.. సుశీల్‌ను అరెస్ట్ చేశారు. అతనిని పట్టుకుంటే లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. సుశీల్‌కు ముందస్తు బెయిల్‌‌ను తిరస్కరించారు. 
 
ప్రస్తుతం కోర్టు రిమాండ్‌లో వున్న సుశీల్ దర్యాప్తునకు సహకరించట్లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో యువ రెజ్లర్‌ సాగర్‌ రాణాపై సుశీల్‌ కుమార్‌ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ పుటేజీ హిందీ, ఇంగ్లిష్‌ మీడియాలో ప్రసారం అవుతోంది. 
 
ఛత్రసాల్‌ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రాణాపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందులో సుశీల్‌ బేస్‌బాల్‌ స్టిక్‌/కర్రను చేతిలో పట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్‌ బయటకు రావడంతో అతడికి మరింత నష్టం కలగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

Harish Rao: ఆంధ్రాలో స్విచ్ వేస్తే, తెలంగాణలో బల్బ్ వెలుగుతుంది.. హరీష్ రావు

రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేశారు.. తీయమన్నందుకు డ్రైవర్ గొంతు కోశారు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

తర్వాతి కథనం
Show comments